హైవే కనెక్టివిటీ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే
కృష్ణా: నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం వేగవంతం చేసినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో రూ. 45లక్షలతో నిర్మిస్తున్న హైవే కనెక్టివిటీ రోడ్డును పరిశీలించారు. ఉపాధి, సాస్కి నిధులతో నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో పంచాయతీ రాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్ ఉన్నారు.