చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి
PPM: సీతానగరం మండలంలోని వెంగళరాయసాగర్ ప్రాజెక్టులో 4 లక్షల చేప పిల్లలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్స్యకార కుటుంబాల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి అధికారులు, స్థానిక ప్రజలు పల్గొన్నారు.