తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. బుధవారం 66,616 మంది శ్రీవారిని దర్శించుకోగా.. 27,837 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.95 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.