'ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి'

KDP: కలెక్టర్ కార్యాలయంలో ఉల్లి కొనుగోలుపై జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంత ఉల్లి రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. క్వింటాల్ ఉల్లి ధర రూ. 1200 ఈక్రాప్లో నమోదు చేసుకున్న రైతుల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు.