వైసీపీ కార్యాలయంలో మహావీర్‌ జయంతి

వైసీపీ కార్యాలయంలో మహావీర్‌ జయంతి

GNTR: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహావీర్ జయంతి (మహావీర్‌ జన్మకల్యాణక్‌) వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్‌ మహావీర్‌ చిత్రపటానికి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను లోకానికి బోధించిన గొప్ప దార్శనికుడు భగవాన్ మహావీర్ అని కొనియాడారు.