ముప్పారంలో ప్రారంభమైన ఐకేపీ కేంద్రం
NLG: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మార్కెట్ ఛైర్మన్ అంకతీ సత్యం సూచించారు. నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. వర్షాల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న రైతులకు ఈ కేంద్రం ఊరటనిస్తుందని, వడ్ల సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.