VIDEO: స్వామివారి సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శనివారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణకుమార్ దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ ఏఈవో రవీంద్రబాబు ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.