చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్

KMM: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గుర్రాలపాడు వద్ద నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు తులాల బంగారం గొలుసు, మరో ఒక తులం బంగారం గొలుసుతో పాటు నల్లపూసల తాడు రికవరీ చేసినట్లు చెప్పారు.