చేపల వేటకు వెళ్లి.. వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి.. వ్యక్తి మృతి

MBNR: బాలానగర్ మండలం నేరెళ్లపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు ఊర చెరువులోకి దిగిన బంటు శ్రీనివాసులు (39), ప్రమాదవశాత్తు తన కాలుకు వల చిక్కుకోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గమనించిన గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.