పొన్నూరులో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ

పొన్నూరులో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ

GNTR: పొన్నూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత కక్షల వల్లే ఈ గొడవ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.