గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు

BHPL: మల్హర్ రావు మండలం కొండంపేట గ్రామానికి చెందిన కొరకాని సమ్మయ్య అనే వ్యక్తి గుడుంబా తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు ఇవాళ దాడులు నిర్వహించారు. అతని వద్ద నుంచి 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 600 లీటర్ల బెల్లం పానకాన్ని క్షేత్రస్థాయిలోనే ధ్వంసం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.