రాజవొమ్మంగి మండల టాపర్గా సబిత

ASR: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాజవొమ్మంగి ఏపీఆర్ పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 80 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. వారిలో 80 మంది ఉత్తీర్ణత సాధించారు. స్కూల్ టాపర్గా కుడుముల సబితా(550) నిలిచింది. మండల టాపర్గా కూడా సబితానే నిలిచిందని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థినిని పలువురు అభినందించారు.