ఘాట్ రోడ్డులో పనులపై అదనపు ఈవో పరిశీలన

ఘాట్ రోడ్డులో పనులపై అదనపు ఈవో పరిశీలన

TPT: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని బాట గంగమ్మ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అలిపిరి నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్ల పర్వతం వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.