VIDEO: హైడ్రో భూతం దిష్టి బొమ్మను దహనం చేసిన ఆదివాసీలు
ASR: హైడ్రో పవర్ ప్రాజెక్ట్లతో ఆదివాసీ ప్రాంతం జల సమాధి అవుతుందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. ఆ ప్రాజెక్ట్లతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆదివాసీల దృష్టిలో నరకాసురిడితో సమానమని, హైడ్రో భూతం దిష్టి బొమ్మను అరకులోయ మండలం, తాంగులగుడలో దహనం చేశారు. ఆ ప్రాజెక్ట్లు రద్దు చేయాలన్నారు.