జనవాసాల మధ్యకు వచ్చేస్తున్న జింకలు

జనవాసాల మధ్యకు వచ్చేస్తున్న జింకలు

VSP: నగరంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరగడంతో వన్యప్రాణులు దారి తప్పుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం విశాలాక్షినగర్ నివాస ప్రాంతంలో ఒక అడవి జింక సంచరించింది. కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యం నుంచి ఆహారం, నీటి కోసం ఇవి జనావాసాల్లోకి వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. జింకలు, దుప్పులు వీధి కుక్కల దాడులు, వాహన ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్దున్నారు.