చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్: విశ్వేశ్వరరెడ్డి
ATP: డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం జోగి రమేష్ను అరెస్టు చేయించిందని ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జి వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారని ఆరోపించారు. నకిలీ మద్యం తయారీ మొత్తం టీడీపీ నాయకుల కనుసన్నుల్లోనే జరిగిందని స్పష్టం చేశారు.