తమిళనాడు బోట్లను ఏపీ బార్డర్లోకి రానివ్వం: మంత్రి
ప్రకాశం: తమిళనాడు, కడలూరు, పాండిచ్చేరిలకు చెందిన సోనాబోట్లు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడి మత్య సంపదను దోచుకెళ్తున్నాయని మంత్రి స్వామి అన్నారు. ఏపీ మత్యసంపద మనవారికే దక్కే విధంగా 4 హైస్పీడ్ బొట్లతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబునాయుడు తెలిపారన్నారు. తమిళనాడు బోట్లు ఏపీలోకి ప్రవేశించకుండా గస్తీ తిరిగే బోటుల్లో ఉన్న పోలీసులకు తుపాకులు అందిస్తామన్నారు.