ధర్మవరంలో టీడీపీ నేతలనిరసన

సత్యసాయి: ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున విధుల్లోకి రాకూడదంటూ మంగళవారం టీడీపీ కార్యకర్తలు 'గో బ్యాక్' నినాదాలతో మున్సిపల్ కార్యాలయం ముందు హోరేత్తించారు. గత ప్రభుత్వంలో కమిషనర్ మల్లికార్జున ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. మళ్లీ ఆయనే తిరిగి కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం సరికాదంటూ నిరసన తెలిపారు.