4 రోజులుగా CT స్కాన్ సేవలు బంద్.. రోగుల అవస్థలు.!
NTR: విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో గత నాలుగు రోజులుగా సీటీ స్కాన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆసుపత్రి ఆవరణలోని ప్రైవేట్, ప్రభుత్వ సీటీ స్కాన్ పరికరాలు ఒకేసారి పాడైపోవడమే దీనికి కారణం. అయితే రోజుకు 200 నుంచి 300 వరకు స్కాన్లు జరిగేవి. అయితే ప్రస్తుతం రోగులను అంబులెన్స్లో బయట కేంద్రాలకు తరలించి స్కాన్లు చేయిస్తున్నారు.