రాష్ట్రపతి ప్రొటోకాల్ ఘటనపై కేంద్రం సీరియస్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటోకాల్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్ సీఎస్ను వివరణ కోరింది. సాయంత్రం 5 గంటలలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా, తన పర్యటనలో బెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ కల్పించకపోవడంపై రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.