రెవెన్యూ సదస్సు దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

రెవెన్యూ సదస్సు దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

HNK: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తహసీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ప్రతి మండలంలో రోజుకు కనీసం 50 దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులను కూడా వేగంగా పరిష్కరించాలన్నారు.