గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసె దగ్ధం

NDL: మహానంది మండలం గాజులపల్లెలో శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసె దగ్ధమైంది. SC కాలనీకి చెందిన పాల ఆదిలక్ష్మమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వెంటనే గుడిసెలో నుంచి బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో రూ.40వేల నగదు, బంగారు కమ్మలు, దుస్తులు, బియ్యం, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు.