రెండు ఓట్ల తేడాతో సర్పంచ్గా గెలుపు
KMR: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మౌలాన్ ఖేడ్లో రెండు ఓట్ల తేడాతో చంద్రశేఖర్ అనే అభ్యర్థి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు, బంధుమిత్రలు అభినందించారు.