పాసు పుస్తకం మంజూరు చేయండి సారు!

సత్యసాయి: పుట్టపర్తిలో ఉన్న తన భూమికి పాస్ బుక్ మంజూరు చేయాలని రైతు చిమిరాల జగన్నాథ్ కలెక్టర్ చేతన్కి సోమవారం వినతి పత్రం సమర్పించారు. సర్వే నెంబర్లు 295-1, 296-3, 296-7 లలో 33 సెంట్ల భూమి ఉందన్నారు. దాన్ని సర్వే చేయించి పాస్ బుక్ మంజూరు చేయాలని 30 ఏండ్ల నుంచి తిరుగుతున్నానని కలెక్టర్తో వాపోయారు.