‘పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి’
AKP: జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని అనకాపల్లి జిల్లా జనసేన అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. శనివారం పాయకరావుపేటలో నియోజకవర్గం జనసేన సమన్వయకర్త గెడ్డం బుజ్జి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సమావేశంలో రమేష్ బాబు పాల్గొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.