దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం

సత్యసాయి: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సత్యసాయి జిల్లాలోని దివ్యాంగులకు ఈనెల 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లాలోని ధర్మవరంలో 7,150 మంది, కదిరిలో 6,081, పుట్టపర్తిలో 5,983, పెనుగొండలో 5,027 మంది లబ్ధిదారులు ఉన్నారు. హిందూపురం, మడకశిర, రాప్తాడు డివిజన్ల పరిధిలోని వికలాంగులకు సైతం ఈ పథకం వర్తిస్తుంది.