తిరుమల లడ్డూ కల్తీ.. కీలక నిందితుడు అరెస్ట్

తిరుమల లడ్డూ కల్తీ.. కీలక నిందితుడు అరెస్ట్

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో A16 అజయ్‌కుమార్ సుగంధ్‌ను సిట్ అరెస్టు చేసింది. అజయ్‌ మోన్‌ గ్లిసరైడ్స్‌, అసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు బయటపడింది. ఆ రసాయనాలను పామాయిల్‌ తయారీలో వినియోగించి, అదే పామాయిల్‌ను నెయ్యి పేరుతో లడ్డూల తయారీ కోసం సరఫరా చేశారని సిట్ పేర్కొంది.