అనాధ మృతదేహానికి అంత్యక్రియలు
W.G: తణుకులో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహానికి ఉందుర్తి పాల్ ఫౌండేషన్ సభ్యులు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. కోర్టు ప్రాంతంలో స్థానికంగా యాచకం చేసుకుంటూ జీవిస్తున్న వృద్ధుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఫౌండేషన్ ఛైర్మన్ ఉందుర్తి ప్రసన్నకుమార్ పట్టణ పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు చేశారు.