అమరావతికి చట్టబద్ధత‌పై జిల్లాలో హర్షం

అమరావతికి చట్టబద్ధత‌పై జిల్లాలో హర్షం

KRNL: పార్లమెంటు ఉభయ సభల్లో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత‌ బిల్లు ఆమోదం పొందడంపై నగరపాలక ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి కేఎంసీ అదనపు కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీశ్ కుమార్, ఉద్యోగులు కొవ్వత్తులు పట్టుకొని హర్షం వ్యక్తం చేశారు. అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. అమరావతి చట్టబద్ధంగా ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమని అభివర్ణించారు.