బోరెడ్డి గారి పల్లిలో ప్రజాదర్భార్
అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డి గారిపల్లిలో బుధవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను స్వయంగా విని వెంటనే పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.