VIDEO: BNS చట్టం ఆధారంగా జిల్లాలో తొలి తీర్పు

JDWL: దేశంలో ఇటీవల అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సురక్షా స్మృతి చట్టం ఆధారంగా జిల్లాలో తొలి తీర్పు వెలువడింది. ఉమ్మిత్యాలకు చెందిన ఈరన్న మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో జిల్లా మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్షకు బదులుగా సమాజసేవ చేయాలని తీర్పు ఇచ్చారు. దీంతో శుక్రవారం ప్రభుత్వాసుపత్రి వద్ద 'మద్యం వద్దు ఫ్యామిలీ ముద్దు' అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.