విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం వివిధ సేవల ద్వారా రూ.1,27,494 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 98 మంది స్వామివారిని దర్శించుకున్నారన్నారు. అలాగే 10 మంది లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనగా, 1450 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.