బషీరాబాద్‌లో ఆగిన 'హుబ్లీ'.. ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది!

బషీరాబాద్‌లో ఆగిన 'హుబ్లీ'.. ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది!

VKB: నవాందీ రైల్వే స్టేషన్‌లో హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్ ప్రారంభమైంది. MP కొండ విశ్వేశ్వర్ రెడ్డి, MLA బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించి రైలుకు పచ్చజెండా ఊపారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బషీరాబాద్ రవాణా పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.