వేంకటేశ్వర ఆలయానికి నిధులు మంజూరు
NZB: సిరికొండ మండలం చిమన్ పల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 10 లక్షల నిధులు మంజూరైనట్లు ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఆలయానికి నిధులు మంజూరు చేయాలని కోరగా వెంటనే మంజూరు చేసినట్లు చెప్పారు. ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, ఉప సర్పంచ్ రాజేందర్, పాలుగోన్నారు.