బుడమేరు ప్రవాహానికి అడ్డంకులు తొలగింపు

NTR: విజయవాడలో బుడమేరు ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలని నగర కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశించారు. కృష్ణలంక, రామవరప్పాడు వంతెన, గుణదల గేటు తదితర ప్రాంతాల్లో బుధవారం పరిశీలన చేశారు. డ్రోన్తో పర్యవేక్షణ, బోట్లతో వ్యర్థాల తొలగింపు కొనసాగించాలన్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీపీడీసీఎల్ను కోరారు.