పుట్టపర్తిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ
సత్యసాయి: పుట్టపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పాల్గొన్నారు. పలు సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను వారు స్వీకరించారు. ఆయా సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.