నేడు యాదాద్రి ఆలయం మూసివేత

BHNG: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం మూసివేయనున్నారు. గ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేసి, రేపు ఉదయం 3.30 గంటలకు ఆలయం తెరుచుకుంటుంది. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు అనంతరం యధావిధిగా నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి.