పాస్ పుస్తకాల జారీలో పొరపాట్లు ఉండొద్దు: జేసీ
W.G: పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియలో ఎటువంటి లోపాలు ఉండకూడదని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్ధాంతం రెవెన్యూ కార్యాలయంలో పాస్ పుస్తకాల పంపిణీపై ఆయన సమీక్ష చేశారు. కొత్త పుస్తకాల్లోని క్యూఆర్ ద్వారా భూమి వివరాలు, హద్దులు, యజమాని సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని జేసీ అన్నారు.