'సురక్షితమైన తాగునీటిని అందించాలి'
VZM: గ్రామాల్లో, పాఠశాలల్లో, వసతి గృహాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో సురక్షితమైన తాగు నీటిని అందించాలని కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్. డబ్ల్యూ.ఎస్, సంబంధిత అధికారులతో తాగునీరు, వేసవి ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్. ఓ ప్లాంట్ లేని పాఠశాల, వసతి గృహాల జాబితాను సిద్ధం చేయాలన్నారు.