గుంటూరులో భక్తిశ్రద్ధలతో చండీ హోమం
GNT: గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మాసశివరాత్రి సందర్భంగా శనివారం రాత్రి చండీహోమం భక్తిశ్రద్ధతో నిర్వహించారు. 9 మంది వేదపండితుల సహకారంతో గణపతి, నవగ్రహాలకు అర్చనలు,హోమాలు చేసి పూర్ణాహుతి చేశారు.లోక కళ్యాణం కోసం ఈ చండీ హోమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ మస్తానయ్య తెలిపారు.