మరింత మెరుగై వస్తాం: సంజు

మరింత మెరుగై వస్తాం: సంజు

నిన్నటి మ్యాచ్‌తో ఈ IPL సీజన్‌లో రాజస్థాన్ ఆట ముగిసింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం RR కెప్టెన్ సంజు మాట్లాడుతూ.. 'మేం మరింత బాగా ఆడాల్సింది. కొన్ని పొరపాట్లు చేశాం. తర్వాతి సీజన్‌కు మెరుగై వస్తాం. మా ఆటతీరుపై సమీక్షించుకుంటాం. ఇక సూర్యవంశీ గురించి చెప్పాలంటే మాటలు రావటం లేదు. అద్భుత సెంచరీ చేశాడు. చిన్న వాడైనా ఆటపై అతడికి చక్కటి అవగాహన ఉంది' అని అన్నాడు.