కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత
SRD: స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి బాషా, నాయకులు కలెక్టరేట్ గేటు ఎక్కి లోపలికి చర్చకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నాయకులను అడ్డుకున్నారు.