VIDEO: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హవేరీలో ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. సెంట్రల్ బస్టాండ్లో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.