రైతుల పొలాల్లో కేబుల్ వైర్లు చోరీ

రైతుల పొలాల్లో కేబుల్ వైర్లు చోరీ

NLR: 15 మంది రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసుకున్న మోటార్ల కేబుల్ వైర్లను దుండగులు చోరీ చేసిన ఘటన దుత్తలూరు మండలంలోని రాఘవరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్టార్టర్ బాక్సులను పగలగొట్టి వైర్లను అపహరించారు. ఈ ఘటనలో రైతులు సుమారు రూ.1.5 లక్షలు నష్టపోయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు శుక్రవారం దుత్తలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.