గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

BDK: భద్రాచలం నుంచి అశ్వారావుపేట మండలానికి మోటార్ సైకిళ్లపై గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను గురువారం అశ్వారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయమైన సమాచారం మేరకు వారిని పట్టుకున్నట్టు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5 కేజీల గంజాయి, 3 బైకులు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.