ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్
మహిళల అంధుల టీ20 ప్రపంచకప్లో భారత్ అదరగొడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 292/4 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్.. 19.3 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటౌంది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన దీపికకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.