గుంటూరులో సహకార బ్యాంకుల మహాజన సభ
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీబీ), జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (జీడీఎంఎస్) ఆధ్వర్యంలో మహాజన సభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జీడీఎంఎస్ ఛైర్మన్ వడ్రణం హరిబాబు నిర్వహించారు. ఈ సమావేశంలో సహకార సంఘాల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై వారు ప్రధానంగా చర్చించారు.