రైతన్నలకు శుభవార్త.. ధాన్యం అమ్మ కాలు సులభతరం
GNTR: అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 వాట్సాప్ నంబర్కు HI అని పంపితే సేవల వినియోగంపై AI వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు. 'రైతులు ఆధార్ నెం. నమోదు చేశాక పేరును ధ్రువీకరించాలి. తర్వాత ధాన్యం విక్రయించే కేంద్రం, తేదీ, సమయం, ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదు చేయాలి. వెంటనే స్లాట్ బుక్ అవుతుంది' అని చెప్పారు.