3వ రోజు ఇంజనీరింగ్ కార్మికుల నిరసన

NTR: రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా సీఐటీయు కొండపల్లి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కార్మికులు జీవో 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లును పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు.