దేవరపల్లి ఎస్సీ ఏరియాలో నరకయాతన!
E.G: దేవరపల్లిలోని ఎస్సీ ఏరియాలో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా మంచి నీటి పైపుల చుట్టూ మురుగు నీరు కుంటల్లా పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలను శుభ్రపరిచి, మంచినీటి సరఫరాను సక్రమంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.